Saturday, April 11, 2020

లాక్ డౌన్ భోజనాలు

గత కొన్ని రోజులుగా దేశంలో, రాష్ట్రంలో లాక్ డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. దీన్నిదృష్టిలో పెట్టుకుని మా నవభారత నిర్మాణ సేన అన్న వితరణ కార్యక్రమాన్ని చేపట్టింది. వలస కార్మికులకు ఆహార వసతి కల్పిస్తూ... వాళ్లకు మేమున్నామని భరోసా ఇస్తోంది. దాతలు, స్నేహితులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తూ మాకు తోడ్పాటును అందిస్తున్నారు. వారి నమ్మకాన్ని, అప్యాయతాభిమానాలను కాపాడుకుంటామని హామీ ఇస్తున్నాము. ఇక గత మంగళవారం ఏబీఎన్ ఛానల్ వారు మా కార్యక్రమాన్ని చిత్రీకరించడం.. అలాగే టీన్యూస్‌లో కూడా ప్రసారం కావడం మాకు ప్రోత్సాహకరంగా ఉంది. ఈ నెల 30వరకు లాక్ డౌన్ ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో మా కార్యక్రమాన్ని మరింత దృఢసంకల్పంతో కొనసాగిస్తామని చెబుతున్నాను. అలాగే మరింత బలాన్ని ఇవ్వాల్సిందిగా ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను. కరోనా భూతం పీడ విరగడ అయ్యేలా చెయ్యాలని కోరుతున్నాను. వందేమాతరం..జైహింద్ 

No comments:

Post a Comment

పున్నమి కౌగిలి

ఒక వర్షం కురిసిన రాత్రి కనులకు నిదుర దూరమైన క్షణం వర్షం వెలిసిన తర్వాత ఆకాశంలో మెరుస్తున్న చుక్కలు పక్కనే తెల్లని కాంతితో సోగ్గాడు చంద్రుడు ...