Monday, April 13, 2020

మీ త్యాగం వృథా కాదు..!


జలియన్ వాలాబాగ్ ఉదంతానికి నేటితో సరిగ్గా 101 ఏళ్లు. స్వాతంత్ర్య కాంక్షతో ఓ చోట గుమిగూడిన అమాయక జనంపై తుపాకీ గుళ్ల వర్షం కురిపించాడు జనరల్ డయ్యర్. వందల మంది ప్రాణాలు కోల్పోయారు. 1919లో జరిగిన ఈ ఘటన 2019తో వందేళ్లు పూర్తి చేసుకుంది. ఆనాటి అమరవీరుల స్మృత్యర్థం భారత ప్రభుత్వం స్మారక స్తూపం నిర్మించింది. ఇప్పుడు మీరు చూస్తున్నది అదే. బాలుడిగా ఉన్న భగత్ సింగ్‌లో తీవ్ర స్వాతంత్ర్య కాంక్షను రగిలించింది ఈ ఘటనే. ఆ నాటి అమరవీరులను గుర్తు చేసుకుంటూ వందేమాతరం.. జైహింద్ 

No comments:

Post a Comment

పున్నమి కౌగిలి

ఒక వర్షం కురిసిన రాత్రి కనులకు నిదుర దూరమైన క్షణం వర్షం వెలిసిన తర్వాత ఆకాశంలో మెరుస్తున్న చుక్కలు పక్కనే తెల్లని కాంతితో సోగ్గాడు చంద్రుడు ...